తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని 100 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. రూ.2,583 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును డీఈసీ ఇన్ ఫ్రా దక్కించుకుంది. ఆరు అంతస్తుల్లో ప్రధాన భవనంతో పాటు 60 మంది జడ్జిలకు సరిపడా కోర్టు హాళ్లు, నివాసాలు, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఇది తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణ వ్యయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ.