అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ దేశంలోని బాలికల విద్యను ప్రోత్సహించడానికి ఒక అద్భుతమైన స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 15,000 మంది బాలికలకు డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ. 30,000 ఆర్థిక సాయం అందిస్తారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లో 10వ, 12వ తరగతి ఉత్తీర్ణులై, 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు.