ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 19 నుంచి దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు నేడు బయలుదేరారు. ఆయనతో పాటు మంత్రులు, అధికారులు కూడా వెళ్తున్నారు. అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలను కలవడంతో పాటు, 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలుగువారి సమ్మేళనంలో ప్రసంగించి, అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 23న హైదరాబాద్కు తిరిగి వస్తారు. అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా ఆయన దావోస్ పర్యటన సాగనుంది.