ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుందా అంటే ఔననే అంటోంది అంతర్జాతీయ మీడియా.. ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ ఏపీలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనుందనే వార్తలు వస్తున్నాయి. విశాఖలో యాక్సెంచర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. కొత్త క్యాంపస్ కోసం పది ఎకరాల భూమిని కూడా కోరినట్లు తెలిపింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.