చెన్నైలో నిర్వహించిన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో రాజకీయ, సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకకు హాజరైన తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీ, అక్కడ ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆత్మీయంగా కలిశారు. పెళ్లి వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసిన వెంటనే సూర్యా బ్రదర్స్ ఆయన్ని ఆలింగనం చేసుకుని పలకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.