మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాను చూసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఫిదా అయ్యారు. "బాస్ చించేశాడు.. బాస్ ఈజ్ బాస్" అంటూ ఆయన తన రివ్యూను ఇచ్చారు. 80, 90వ దశకంలో చిరంజీవి మాస్ హిట్లు చూసినప్పుడు ఎలాంటి ఎగ్జైట్మెంట్ కలిగిందో, మళ్ళీ ఈ సినిమా చూస్తుంటే అదే ఫీలింగ్ వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. విక్టరీ వెంకటేష్ ఎంట్రీ, క్లైమాక్స్లో చిరు-వెంకీ కాంబినేషన్ అదిరిపోయిందని, ప్రేక్షకులకు ఇది పక్కా సంక్రాంతి విందు అని ఆయన కొనియాడారు. చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత ఇది బెస్ట్ ఫిలిం అని అరవింద్ అభివర్ణించారు.