ఏపీ రాజధాని అమరావతిలో సరికొత్త సాంకేతిక విప్లవానికి బలమైన అడుగు పడింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ భవనం నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అమరావతి క్వాంటం వ్యాలీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు ఈ ఏడాది ఆఖరికి అమరావతి క్వాంటం వ్యాలీలో.. క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఏప్రిల్ 14వ తేదీ మరో రెండు క్వాంటం సెంటర్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.