యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గట్టిగా స్పందిస్తూ స్పష్టమైన, ఘాటు కౌంటర్ ఇచ్చారు. తిండి, బట్ట అనేవి పూర్తిగా వ్యక్తిగత అభిరుచులు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలని ఆమె తేల్చి చెప్పారు. ఎవరు ఏమి తినాలి, ఎలా ఉండాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అన్న విషయాలపై ఇతరులు తీర్పులు చెప్పడం సమంజసం కాదని, ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన విధంగా జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చిన మౌలిక స్వేచ్ఛలో భాగమని పేర్కొన్నారు.