విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసింది. రూ.1200 కోట్లు విడుదల చేస్తూ ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఏపీ ప్రభుత్వం దశలవారీగా విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.1200 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసింది.