Gali Bhanu Prakash: రోజా అరిస్తే భయపడేవాడు ఇక్కడ ఎవడూ లేడు..

1 year ago 26
వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాకు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వార్నింగ్ ఇచ్చారు. దొంగే.. దొంగా దొంగా అని అరిస్తే భయపడేవాళ్లు లేరని అన్నారు. గంజాయి అమ్మేవాళ్లు ఎవరైనా జైలుకు పోవటం ఖాయమని.. వదిలేది లేదని హెచ్చరించారు. వైసీపీ నేతలు ఇప్పుడు కూడా బియ్యం, ఇసుక, గంజాయి వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు.చాలా వాటిల్లో రోజా, అమె కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయంటూ నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు. గంజాయి అమ్మకాలలో దొరికితే మాత్రం వాళ్ళనీ మెడ పట్టుకుని లాక్కెళ్ళి లోపల వేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరిలో రోజా కుటుంబం అరాచకాలు భరించలేక 45 వేల ఓట్ల తేడాతో ఓడించారని విమర్శించారు.
Read Entire Article