GMR Land Donation: ప్రముఖ వ్యాపారవేత్త జీఎంఆర్ గ్రంధి మల్లికార్జునరావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. విజయనగరం జిల్లా రాజాం వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయానికి రూ. కోటి విలువైన 19 సెంట్ల స్థలాన్ని విరాళంగా అందించారు. అంతేకాకుండా, సంక్రాంతి పండుగ సందర్భంగా 8 వేల మందికి రూ. 64 లక్షల విలువైన వస్త్రాలను పంపిణీ చేశారు. పలువురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యాభ్యాసానికి అండగా నిలుస్తునాని మాట ఇచ్చారు.