క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పేద రోగులకు ఎంఎన్జే ఆసుపత్రిలో ఉచితంగా సర్జరీలు చేస్తున్నారు. రోబోటిక్ విధానంలో రోగులకు ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు చేస్తున్నారు. గత రెండున్నరేళ్లలో ఆసుపత్రిలో రూ.12.5 కోట్ల విలువైన సర్జరీలు చేసినట్లు వైద్యులు వెల్లడించారు.