కూకట్పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్లో విద్యార్థులు.. రౌడీల మాదిరిగా పరస్పరం దాడులు చేసుకున్నారు. రెండు హాస్టల్స్లోని విద్యార్థులు.. కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీజ్ వేడుకల సందర్భంగా మాటా మాటా పెరిగి చివరకు ఘర్షణకు దారితీసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ చేపట్టారు.