AP Govt Posting To IAS Sri Lakshmi : సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రిటైర్మెంట్కు నాలుగు రోజుల ముందు స్పెషల్ చీఫ్ సెక్రటరీ పోస్టును కట్టబెట్టింది. దీంతో ఆమె గౌరవంగా తన ఉద్యోగ జీవితానికి వీడ్కోలు పలకనున్నారు. గత రెండేళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తు్న్న ఆమెకు ఇది భారీ ఊరటేనని చెప్పొచ్చు. ఐఏఎస్ శ్రీలక్ష్మీ సస్పెన్షన్లో లేకపోవడంతో సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదంగా రిటైర్ అయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో వివాదాలు ఉన్నప్పటికీ, ఆమెకు కెరీర్ చివర్లో గౌరవం దక్కినట్లయ్యింది. అదే సస్పెన్షన్లో ఉండి ఉంటే మాత్రం పరిస్థితి మరోలా ఉండేది.