ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణలు వచ్చిన కడప మేయర్ సురేష్ బాబును ఆ పదవి నుంచి తొలగించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కడప మేయర్ సురేష్ బాబు మీద అనర్హత వేటు వేస్తూ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కడప మేయర్ సురేష్ బాబు, కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి మధ్య గత కొంతకాలంగా వాగ్వాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.