'తుంబాడ్' సినిమాతో ఒక్క హిందీ ప్రేక్షకులను మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ సినీ లవర్స్ను తన వైపు చూసేలా చేసుకున్నాడు దర్శకుడు రహి అనీల్ బార్వే. ఆ సినిమా వచ్చిన 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త సినిమా చేస్తున్నాడు. అదే మయసభ. ఇప్పటికే రిలీజైన టీజర్ గట్రా ఆడియెన్స్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు.