హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వెళ్లారు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మనవడు, మానవరాళ్లను చూడటానికి చిరంజీవి అపోలో ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ మెగా అభిమానుల సందడి నెలకొంది. రామ్ చరణ్కు కవలలు వచ్చిన వార్తతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేస్తున్నారు. మెగా కుటుంబంలోకి మరోసారి ఆనందం రావడంతో ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.