Mutton Price Hike: మటన్ ధరలను పెంచారని.. స్థానికుల నిరసన.. ఎక్కడంటే..

1 month ago 6
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో మటన్ ధరలు అమాంతం పెరగడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న తాడ్వాయి, గాంధారి మండలాల్లో మేక మాంసం కిలో 600 రూపాయలకు అమ్ముతుంటే.. లింగంపేటలో మాత్రం 800 రూపాయలు వసూలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అలాగే పొట్టేలు మాంసం ధరను ఇతర ప్రాంతాల కంటే 200 రూపాయలు అదనంగా పెంచి 900 రూపాయలకు విక్రయిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ధరలు పెంచడమే కాకుండా.. అనారోగ్యంతో ఉన్న జీవాల మాంసాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
Read Entire Article