మెగా హీరో రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శనివారం కలిశారు. ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన ఆర్చరీ లీగ్ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఈ లీగ్ సక్సెస్ అయిన సందర్భాన్ని గుర్తు చేసుకొని, మోదీని కలిసినట్లు చరణ్ వెల్లడించారు. కొన్ని ఫొటోలు మరియు వీడియోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.