మర్దాని 3' చిత్రంతో మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాణి ముఖర్జీ.. ముంబై పోలీస్ డాగ్ స్క్వాడ్ను సందర్శించారు. విధి నిర్వహణలో పోలీస్ శునకాల పాత్రను, వాటిని సంరక్షించే అధికారుల అంకితభావాన్ని ఆమె కొనియాడారు. జనవరి 30న విడుదలైన 'మర్దాని 3'లో చిన్నారులను కిడ్నాప్ చేసే మాఫియా గుట్టురట్టు చేసే ధీరవనితగా రాణి నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.