నటుడు వరుణ్ సందేశ్ ఈసారి భక్తిశ్రద్ధలతో ఇరుముడి ధరించి శబరిమలకు పయనం అయ్యారు. అయ్యప్ప దీవెనలు పొందేందుకు ప్రత్యేక పూజలు చేసి, ఇరుముడి కట్టుతో దేవుడి దర్శనానికి బయలుదేరిన వరుణ్ సందేశ్ భక్తులను ఆకట్టుకున్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలధారణ చేసి శబరిమల యాత్ర చేసే వరుణ్, ఈసారి మరింత భక్తి భావంతో పాదయాత్ర చేయనున్నారు.