వచ్చే ఏడాదిలోనే తన పెళ్లి జరగబోతుందని స్పష్టత ఇచ్చిన హీరో సాయి ధర్మ తేజ్. తిరుమలలో ఆలయ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, పెళ్లి విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే చేస్తానని తెలిపారు. అభిమానులు, కుటుంబ సభ్యుల ఆశీస్సులతో కొత్త జీవితానికి సిద్ధమవుతున్నానని చెప్పిన సాయి ధర్మ తేజ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.