వైఎస్సార్ కడప జిల్లాలోని విద్యార్థులకు బ్యాడ్ న్యూస్. ఫిబ్రవరి 14వ తేదీ రెండో శనివారం సెలవు లేదు. పాఠశాలలు యధావిధిగా పనిచేయనున్నాయి. మొంథా తుఫాను సమయంలో జిల్లాలోని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ఇచ్చారు. వీటికి బదులుగా రెండో శనివారం తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14వ తేదీ స్కూళ్లు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.