హీరో శర్వానంద్ తన కొత్త సినిమా ‘నారీనారీ నడుమ మురారి’ టికెట్ ధరలపై కీలక ప్రకటన చేశారు. సినిమా టికెట్లు అన్నీ MRP ధరలకే ఉంటాయని, ఒక్క రూపాయి కూడా పెంచడం లేదని స్పష్టం చేశారు. సామాన్య ప్రేక్షకులు సులభంగా థియేటర్కు వెళ్లి సినిమా చూసే విధంగా ధరలు ఉంటాయని శర్వానంద్ తెలిపారు.