టాలీవుడ్ హీరో శర్వానంద్ విడాకుల బాట పెట్టారనే విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. 2023లో రక్షితను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన ఇప్పుడు ఆమెకు దూరంగా ఉంటున్నారని, ఇద్దరూ విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నారనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.