అస్సాం ప్రఖ్యాత గాయకుడు జూబిన్ గార్గ్ పార్థివదేహం గువాహటికి చేరుకుంది. గువాహటి ఎయిర్పోర్ట్ వద్ద ఆయనను చివరి సారి చూసేందుకు వేలాది మంది అభిమానులు కన్నీటి కళ్లతో చేరుకున్నారు. సంగీత రంగంలో అమోఘ సేవలందించిన జూబిన్ గార్గ్ మరణం దేశవ్యాప్తంగా అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఆయనకు అభిమానులు, స్నేహితులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.