నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు తాకిడి పెరిగింది. శివ దీక్ష తీసుకున్న స్వాములకు ఫిబ్రవరి 12వ తేదీ వరకూ స్పర్శ దర్శనం కల్పించారు. దీంతో శివస్వాములు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇదే సమయంలో సాధారణ భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తూ శివస్వాములు ఆరోపిస్తున్నారు. స్పర్శ దర్శనానికి ఆలస్యమవుతోందంటూ సోమవారం నిరసన తెలిపారు. కొంతమంది క్యూలైన్ల గేట్లు విరగకొట్టారు.