తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘జయ జయ జయ జయ హే’ సినిమాకు అధికారిక రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రియుల ముందుకు వస్తోంది.