తెలంగాణలోని కంది రైతులకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ కందుల మద్దతు ధరను 8,000 రూపాయలుగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.99 లక్షల ఎకరాల్లో కంది సాగు చేసిన రైతుల కోసం మార్చి 2026 వరకు కొనుగోళ్లు కొనసాగుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మరోవైపు ధాన్యం సేకరణలో 6.93 లక్షల మెట్రిక్ టన్నులతో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, నల్లగొండ రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వ కేంద్రాల్లో పంట విక్రయించిన వారం రోజుల్లోనే నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది.