హైదరాబాద్ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్న్యూస్. బస్సు టికెట్ ధరలు 30 శాతం తగ్గనున్నాయి. అయితే ఈ ఛార్జీల తగ్గింపు అన్ని బస్సుల్లో కాదు. కేవలం ఏసీ బస్సుల్లో మాత్రమే. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బస్సుల్లో ఛార్జీల ధరలు తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే నెలాఖరు వరకు ఈ తగ్గింపు వర్తించనుంది.