పెళ్లి చూపులు సినిమాతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా వంటి సినిమాలతో యూత్ ఫేవరైట్ డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకున్నాడు. కేవలం దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇక తాజాగా ఆయన హీరోగా నటించిన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈశా రెబ్బా హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది.