Tirumala: తిరుమలలో భక్తుల రాకపోకలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లో పలువురు ప్రముఖులు భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సన్నిధికి విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.