టీటీడీకి మరోసారి భారీ విరాళం అందింది. ఎన్నారై భక్తుడు టీటీడీకి భారీ విరాళం సమర్పించారు. టెక్సాస్లో ఉండే వేదాల రంగనాథ్ దంపతులు టీటీడీ ట్రస్టులకు రూ.11 లక్షలు విరాళంగా అందించారు. ఎస్వీ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ. లక్ష విరాళంగా అందించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగియనుండటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.