దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ హీరోగా, కీర్తి సురేశ్ హీరోయిన్గా ఓ కొత్త సినిమాను ఘనంగా ప్రారంభించారు. ఈ మూవీకి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రారంభ వేడుకలో విజయ్, కీర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాకు 'రౌడీ జనార్ధన్' అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ముహూర్తపు సన్నివేశానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.