టాలీవుడ్ స్టార్ హీరో విజయ దేవరకొండ మరియు ప్రముఖ నటి రష్మిక దంపతులు నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మెన్పేట గ్రామానికి చేరుకున్నారు. సొంతూరికి వచ్చిన ఈ జంట కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొననున్నారు. పెళ్లి అనంతరం మొదటిసారిగా గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు, బంధువులు వీరికి ఘన స్వాగతం పలికారు.