టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి ముహూర్తం ఖరారైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రకారం, వీరు ఫిబ్రవరి 26, 2026న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుంది. అనంతరం, మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విజయ్ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన పెళ్లికి ఆహ్వానించిన ఫోటోలు బయటకు రావడంతో ఈ పెళ్లి వార్త అధికారికంగా ధృవీకరించబడినట్లయింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో అలరించిన ఈ జంట నిజ జీవితంలోనూ ఒకటి కాబోతుండటంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.