కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి TVK పార్టీ అధినేత విజయ్ నేడు CBI విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఫ్లైట్లో ఢిల్లీకి బయలుదేరినట్లు సమాచారం. గతేడాది సెప్టెంబర్లో కరూర్లో జరిగిన ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఆరు రోజుల క్రితం విజయ్కు CBI సమన్లు జారీ చేసింది.