వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన లోటస్పాండ్కు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని మరియు మరో ముగ్గురు నేతలను పోలీసులు కోర్టు లోపలికి అనుమతించకపోవడంతో వారు గేటు వద్దే నిల్చున్నారు.