శ్రీశైలంలో శివస్వాముల ఇబ్బందులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. శివ మాల దీక్షాధారులపై లాఠీఛార్జి దారుణమన్న వైఎస్ జగన్.. ఏపీలో దిగజారుతున్న పరిస్థితులకు ఇది నిదర్శనమన్నారు. భక్తులు ఒకప్పుడు ఆలయాలకు భక్తి, నమ్మకంతో వచ్చేవారని.. ఇప్పుడు మాత్రం ఆందోళన, అనిశ్చితితో వస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీ కూటమి పాలనలో గతేడాది జరిగిన ఆలయ ప్రమాదాల గురించి జగన్ ప్రస్తావించారు.