Tirumala New Rtc Bus Depot 300 Electric Buses: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. తిరుమల, తిరుపతిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ముఖ్యమంత్రి సూచన మేరకు మరో 300 బస్సులు కేటాయించే ప్రక్రియ జరుగుతోంది. అంతేకాదు ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ పాయింట్లు, కొత్త డిపో ఏర్పాటుతో ఈవీ పాలసీ అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.