ఆగష్టు 2న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేశారు. అయితే కొంతమంది రైతుల ఖాతాలో నిధులు జమ కాలేదు. అలాంటి వారి కోసం అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. నిధులు జమ కాని రైతులు అందుకు కారణాలు తెలుసుకొని, సమస్యలు పరిష్కరించుకుంటే నిధులు జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఆగస్టు 3 అనగా నేటి నుంచే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆ వివరాలు..