ఏపీ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మళ్లీ వేడెక్కింది. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు. అమరావతిని హైదరాబాద్తో పోల్చలేమని, ప్రపంచంలోనే టాప్ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తూ, జగన్కు రివర్ బెడ్, బేసిన్ తేడా తెలియదని విమర్శించారు. అమరావతిని ఆపడం అసాధ్యమని, వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు.