ఏపీలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొన్ని రోజల క్రితం ఆయన ఏపీ రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై ఆయనను వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసు జారీ చేసింది. అయితే బోస్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.