Varun Group Hotel Established In Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హోటల్స్ నిర్మాణానికి పలు సంస్థలు క్యూ కడుతున్నాయి. వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అమరావతిలో నోవోటెల్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేసింది. అంతేకాదు విశాఖపట్నంలో కూడా రూ.500 కోట్ల భారీ హోటల్ నిర్మించనున్నారు. సింగపూర్ తరహాలో మూడు టవర్లతో ఈ హోటల్ ప్లాన్ చేశారు. ఇలా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వరుణ్ గ్రూప్ ముందుకు వచ్చింది.