లక్కీ డ్రా పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కార్లు, ప్లాట్లు ఇస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.