ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సమయపాలన తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలస్యంగా విధులకు హాజరైతే ఆ రోజు వేతనంలో కోత విధిస్తారు. ఫేషియల్ హాజరు తప్పనిసరి చేస్తూ, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనివేళలు నిర్ణయించారు. ఈ నిబంధనలు సచివాలయ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్లో భాగం అంటున్నారు అధికారులు. సిబ్బంది కచ్చితంగా ఈ నిబంధనను పాటించాలని చెబుతున్నారు.