గ్రామ కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టాలని డిసైడ్ అయింది. కార్యదర్శుల అటెండెన్స్పై ఎంపీవోలు, డీపీవోల పర్యవేక్షణ లోపంపై ప్రభుత్వం సీరియస్ అయింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు త్వరలోనే అన్ని గ్రామ పంచాయతీల్లో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నారు.