టెర్రాసిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫీల్డ్ స్టాఫ్ను భూభారతి కాంట్రాక్టు ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకు ధరణి ఆపరేటర్లుగా ఉన్న వారిని అధికారికంగా టీజీటీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తిస్తూ, నెల జీతం రూ.12 వేల నుంచి రూ.28,148కు పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్కి విజయదశమి కానుకగా నిలిచింది. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ చర్య తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు స్టాఫ్ కృతజ్ఞతలు తెలిపారు.