మారుమూల మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లకు రూ.5.7 లక్షల జీతం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 'యూ కోట్ వి పే' విధానం ద్వారా ఈ జీతాలు చెల్లించనున్నారు. రిమోట్ ఏరియాల్లోని మెడికల్ కాలేజీల్లో పాఠాలు బోధించేందుకు ప్రొఫెసర్లు వెనకడుగు వేస్తుండటంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.