Pawan kalyan on Janasena Follower Veera venkata Vasantha Royal: కృష్ణా జిల్లాకు చెందిన జనసేన కార్యకర్త కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. వీర వెంకట వసంత రాయలు అనే కార్యకర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో అతని కుటుంబం మానవతా దృక్పథంతో అవయవదానానికి ముందుకు వచ్చింది. మరో ఏడుగురికి అవయవదానం చేసేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీర వెంకట వసంత రాయలు కుటుంబాన్ని ప్రశంసించారు.